Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్…
ఆంధ్రప్రదేశ్లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మొత్తం 28 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు కెజిబివి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం…
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉంటే అందులో 696 అంటే సుమారుగా 15 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.