Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యాలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు.
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Actor Darshan: కర్ణాటకలో రేణుకాస్వామి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అభిమానిని కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తూగదీప, అతడి అనుచరులు దాడి చేసి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్కి కర్ణాటక హైకోర్టు ఊరట కల్పించింది. దర్శన్ దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ కేసుని ఏప్రిల్ 08కి వాయిదా వేసింది.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత చర్యలు ప్రారంభించారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులలో జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా…
Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను నిలిపివేస్తూ కర్ణాటక హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
Supreme Court: పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Lokayukta MUDA Probe: కర్ణాటక హైకోర్టు గురువారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను జనవరి 28లోపు సమర్పించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ 24 నాటికి లోకాయుక్త నివేదికపై పురోగతిని చూపించాల్సిందని ఆదేశించిన కింది స్థాయి కోర్టు ఆదేశాలను, హైకోర్టు ఇప్పుడు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్నా ఉండగా.. జనవరి 28 వరకు లోకాయుక్త నివేదిక సమర్పించకూడదని ఆదేశించారు. Also Read: CM…
Bengaluru: దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. ‘‘తన భర్త తన కన్న పెంపుడు పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు’’ అంటూ భార్య కేసు పెట్టింది. సాధారణ వైవాహిక సమస్యగా ప్రారంభమైన ఈ వివాదం కోర్టుకు చేరింది. తన భర్త పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, పిల్లి తనను రక్కిందని భార్య తన కేసులో పేర్కొంది.