కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ, జేడీఎస్లు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కన్నడ సినీ స్టార్ శివరాజ్కుమార్ సతీమణి గీతా శివ రాజ్కుమార్ జేడీఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.
Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన…
Amit Shah: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
Karnataka Elections: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచబోతున్నాయా..? అంటే బీజేపీ ఆ విధంగానే సింపతి సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా ఈ రోజు కలబురిగిలో జరిగిన ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విషపు పాము లాంటి వాడని, బీజేపీ పార్టీ కూడా అటువంటిదే అని వ్యాఖ్యానించాడు. అతను విషపు పామా..? కదా..?…
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోదీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని,
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని…
Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఆమె సందడి చేశారు.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు.