Yogi Adityanath: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.. కాంగ్రెస్పై యోగి అటాక్..
Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని.. కాంగ్రెస్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ని ప్రసన్నం చేసుకునేందుకు మత ఆధారిత రిజర్వేషన్లను ఇస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ బలమైన కోట, వొక్కలిగ ఓట్లకు కీలకమైన ప్రాంతం అయిన మాండ్యా నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Read Also: MLC Jeevan Reddy : సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన రూ.10 వేల నష్టపరిహారం ఎక్కడా..?
Also Read
- West Bengal ElectIon Results: ప్రధాని మోడీ ‘‘ఝల్మురి’’ తిన్న చోట బీజేపీ ఆధిక్యం..
- Actor Vijay TVK Promises: తమిళనాడులో టీవీకే తుఫాన్.. బలమైన ఆరంభానికి నటుడు విజయ్ 7 అద్భుతమైన హామీలు
- TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ
- West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
కేంద్రం, రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల గత ఆరేళ్లుగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 2బి కేటగిరీ కింద ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, మత ఆధారిత కోటాకు రాజ్యాంగపరమైన మద్దతు లేదని అన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల వీటిని రద్దు చేసింది. ఈ 4 శాతం రిజర్వేషన్లను సమానంగా విభజించి వొక్కలిగ, లింగాయత్ వర్గాలకు రెండు శాతం చొప్పున కేటాయించింది.
భారత దేశం 1947లో మత ప్రాతిపదికన విభజించబడింది, దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను ఆమోదించమని, మరొక విభజనకు సిద్ధంగా లేమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్రం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాలు పీఎఫ్ఐ వంటి ఇస్లామిక్ సంస్థల వెన్ను విరిచాయని తెలిపారు. యూపీలో ప్రజల భద్రతకు హామీ ఇచ్చమని, ఇప్పుడు యూపీలో అల్లర్లు, కర్ఫ్యూలు లేవని ఆయన అన్నారు. బీజేపీ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ (ఏక భారత్, గొప్ప భారతదేశం) భావన మాత్రమే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
West Bengal ElectIon Results: ప్రధాని మోడీ ‘‘ఝల్మురి’’ తిన్న చోట బీజేపీ ఆధిక్యం..
-
Actor Vijay TVK Promises: తమిళనాడులో టీవీకే తుఫాన్.. బలమైన ఆరంభానికి నటుడు విజయ్ 7 అద్భుతమైన హామీలు
-
chandrabose: చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం..
-
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
-
BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!