Amit Shah: బీజేపీకి వేసే ప్రతీ ఓటు పీఎఫ్ఐ నుంచి కర్ణాటకను కాపాడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన నాయకత్వానికి వెళ్లేలా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
కమలానికి ఓటేసే సమయంలో కేవలం ఎమ్మెల్యే, మంత్రిని ఎన్నుకోవడానికి ఓటేయడం లేదని, మహాన్ కర్ణాటకను రూపొందించడానికి, ప్రధాని మోడీతో నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు ఓటేస్తున్నామని గుర్తుంచుకోండని అన్నారు. కర్ణాటకకు రక్షణ, శ్రేయస్సును కేవలం బీజేపీ మాత్రమే ఇవ్వగలదని, శాంతియుత, సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎఫ్ఐని నిషేధించామని ఆయన అన్నారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
కాంగ్రెస్ మతప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించిందని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ సరిదిద్దింది అని, ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, వొక్కలిగ, లింగాయత్ లకు కేటాయించామని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ కోటాను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, ఇదే జరిగితే మళ్లీ లింగాయత్, వొక్కలిగ వర్గాలు రిజర్వేషన్లు కోల్పోతారని అన్నారు.
ప్రపంచం అంతా ప్రధాని మోడీని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ‘విషసర్పం’ అంటూ విమర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కు భిన్నంగా రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిలబడుతోందని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించలేదని, మోడీ రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు ఈ సమస్యను పరిష్కరించి ఉత్తర కర్ణాటక రైతులకు మేలు చేశారని అన్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!