Amit Shah: బీజేపీకి వేసే ప్రతీ ఓటు పీఎఫ్ఐ నుంచి కర్ణాటకను కాపాడుతుంది..
Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన నాయకత్వానికి వెళ్లేలా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
కమలానికి ఓటేసే సమయంలో కేవలం ఎమ్మెల్యే, మంత్రిని ఎన్నుకోవడానికి ఓటేయడం లేదని, మహాన్ కర్ణాటకను రూపొందించడానికి, ప్రధాని మోడీతో నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు ఓటేస్తున్నామని గుర్తుంచుకోండని అన్నారు. కర్ణాటకకు రక్షణ, శ్రేయస్సును కేవలం బీజేపీ మాత్రమే ఇవ్వగలదని, శాంతియుత, సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎఫ్ఐని నిషేధించామని ఆయన అన్నారు. టీ అమ్ముకునే స్థాయి నుంచి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని అమిత్ షా అన్నారు.
Also Read
Read Also: LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
కాంగ్రెస్ మతప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించిందని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ సరిదిద్దింది అని, ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, వొక్కలిగ, లింగాయత్ లకు కేటాయించామని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ కోటాను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, ఇదే జరిగితే మళ్లీ లింగాయత్, వొక్కలిగ వర్గాలు రిజర్వేషన్లు కోల్పోతారని అన్నారు.
ప్రపంచం అంతా ప్రధాని మోడీని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ‘విషసర్పం’ అంటూ విమర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కు భిన్నంగా రైతుల సంక్షేమం కోసం బీజేపీ నిలబడుతోందని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించలేదని, మోడీ రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు ఈ సమస్యను పరిష్కరించి ఉత్తర కర్ణాటక రైతులకు మేలు చేశారని అన్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో