Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్ను రమ్మను. కరీంనగర్లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని…
కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు.
కరీంనగర్ అశోక్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. కరీంనగర్ ప్రగతి కోసం రూ. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. గంగుల… నువ్వు సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. ఐటీ టవర్లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్.. కోచింగ్ లేక బీసీ స్టడీ సర్కిల్ వెక్కిరిస్తోంది.. తీగల వంతెన వీక్లీ డ్యాన్స్ క్లబ్లా మారింది.. అంటూ ఎద్దేవా చేశారు. కబ్జాలు,…
కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం కరీంనగర్లో 59వ వార్డులో పర్యటించిన ఆయన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని పెద్దపెద్ద సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెప్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులో అభ్యర్థి సంతకం పార్టీ ప్రెసిడెంట్ సంతకాలు ఉంటాయని తెలిపారు. గ్యారెంటీ కార్డు అనేది అప్పు పత్రం…
కరీంనగర్ ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తిగా మారాయి. గత మూడు రోజులుగా ప్రచారంలో గంగుల జోరు తగ్గిందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గంగులకు మద్దతుగా కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతల భార్యలు ప్రచారంలోకి దిగారు. గంగుల గెలుపు కోసం ఆయన సతీమణి రంగంలోకి దిగారు. ఆమెతో పాటు ప్రముఖ ముఖ్య నేతల భార్యలు కూడా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. Also Read: IND vs AUS T20: విశాఖ వేదికగా తొలి…
CM KCR: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల ప్రచారానికి వినియోగించిన బస్సును సోమవారం కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాన్కొండూరులో నిర్వహించనున్న బీఆర్ఎస్ జన్ ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్పై ఎంపీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా పరీక్షలకు అనుమతిస్తారా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. దరఖాస్తు చేయకుండా మెడికల్ కాలేజీలెట్లా మంజూరు చేస్తారో చెప్పు అంటూ ప్రశ్నలు గుప్పించారు.
కేవలం అవినీతి ఆరోపణలతో కోటాను కోట్లు డబ్బుల సంచులు తీసుకున్నందుకే బండి సంజయ్ పదవిని తీసేయడం జరిగింది.. ఇయ్యాలా ఆ నోట్ల కట్టలతో ఓటుకు 20 వేలైనా వెదజల్లి గెలుస్తా అనే డబ్బు మదంతో పోటీలో దిగాడని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.
నేడు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాన్నం 1 గంటకి తొలుత మొదట కరీంనగర్ కు చేరుకోనున్నారు.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
Bandi Sanjay: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.