ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.
Kanchipuram Man Dies After Choking on Boiled Egg: ‘మృత్యువు’ ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో చెప్పలేం. అప్పటివరకూ మన పక్కన ఉన్నవారే.. ఊహించని విధంగా చనిపోతుంటారు. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరగడం, ఉన్నపలంగా గుండెపోటు రావడం, గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా అలాంటి విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో చోటుచేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. Also…
Kanchi Kamakshi: తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులచే ఆరాధించబడుతోంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక వృత్తాంతాలు చెబుతున్నాయి. అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై కూర్చుని చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. ఇది ఆధ్యాత్మికంగా ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతని అందించింది. కాంచీపురం నాభిస్థాన…
తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా.. చంపేస్తామంటూ…
తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘర్షణ.. ఉత్తరాది, దక్షిణాది అర్చకుల మధ్య గొడవ.. గత రాత్రి ఆలయంలో హనుమంతు వాహన సేవ.. స్వామివారి నైవేద్యం దోస, వడ పంచుకునే విషయంలో వివాదం.. స్వామినామాలు జపిస్తూనే వాదించుకున్న అర్చకులు
తమిళనాడులోని కాంచీపురంలో ఇవాళ ఘోర పేలుడు సంభవించింది. కాంచీపురంలోని కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమ య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక పెరంబలూరు, అరియలూరు, ధర్మపురి, తిరప త్తూరు, వెల్లూరు, రాణిపేట్లలో…
విజయవాడలో అతిపెద్ద కాంచీపురం గౌరి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం బుధవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిల్క్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిశుడు) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు ఓకే ఒక వేదిక కాంచీపురం గౌరి సిల్క్స్ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన విలక్షణమైన కంచి…