కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ లో కరోనా సోకడంతో ఆయన పది రోజులకు పైగానే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది. ఇక ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్…
ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ…
ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన అనేక మలయాళ చిత్రాలను తెరకెక్కించారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దర్శకుడు తన భార్య వల్సల సేతుమాధవన్, ముగ్గురు పిల్లలు సంతోష్, ఉమా మరియు సోను కుమార్లతో కలిసి ఉంటున్నారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమాలకు చేసిన కృషికి గానూ 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర…
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవుతూ నోటీసులు జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. యూఎస్…
నవంబర్ 22న కరోనా సోకి శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనకు…
నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నవంబర్ 22న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లొచ్చాక కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అదే రోజు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో కమల్ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కమల్ తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు డిసెంబర్ 3 వరకు కమల్ హాసన్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు…
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ యుఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ వారం ప్రారంభంలో చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత కమల్కు దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యుల సలహా మేరకు కోవిడ్ టెస్ట్…
దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తనకు కోవిడ్ -19 సోకింది అంటూ గురించి ట్వీట్ చేసినప్పటి నుండి ఆయన అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని పగలు, రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. రజినీకాంత్ తో సహా పలువురు ప్రముఖులు ఆయన…