సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే, వేములలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం యూడీఏలపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (యూడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి నారాయణ..
మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు.. కడపలో సమావేశమైన వైన్స్ షాపులు, బార్ల యజమానులు మద్యం అమ్మకాలపై కమిషన్పై చర్చించారు.. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు..
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ భద్రత నడుమ కడప పీఎస్కు తరలించినట్లు సమాచారం.
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు
కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్... జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్…
కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది... కడప మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల వద్ద ఉన్న వంటశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది..
పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం అన్నారు..