Liquor Commission: మద్యం కమిషన్ పెంచండి.. లేకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం…
- కడపలో సమావేశమైన మద్యం షాపుల యజమానులు..
- మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం..
- ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Commission: మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు.. కడపలో సమావేశమైన వైన్స్ షాపులు, బార్ల యజమానులు మద్యం అమ్మకాలపై కమిషన్పై చర్చించారు.. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. మద్యం షాపులకు ఇస్తున్న కమిషన్ ను వెంటనే పెంచాలంటూ మద్యం షాపులు, బార్ షాపుల యజమానుల సమావేశంలో పాల్గొన్న లిక్కర్ షాపుల యజమానులు డిమాండ్ చేశారు.. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5% శాతం మార్చాలని సమావేశంలో నిర్ణయించారు మద్యం షాప్ యజమానులు.. కడప నగరంలోని బాలాజీ ఇన్ హోటల్ లో ఈ సమావేశం జరిగింది..
Read Also: Bangladesh: భారతదేశ బస్సుపై దాడి.. బకాయిలు కట్టాలని బంగ్లాదేశ్కి త్రిపుర ఆదేశం..
Also Read
ఈ నెల 5వ తేదీన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వనున్నట్టు మద్యం షాపుల యూనియన్ నేతలు వెల్లడించారు.. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోక పోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు.. అంతేకాదు.. జనవరిలో కట్టాల్సిన లైసెన్సు ఫీజులు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!