YS Jagan: ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు జగన్.. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా అనుమతులు..!
- కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..
- ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరిన జగన్..
- వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ ప్రయాణం కాస్త ఆలస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్… జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు త్వరగా రాలేదు.. వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ బెంగళూరు ప్రయాణం కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది..
Read Also: Sivakarthikeyan : అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ
Also Read
ఇక, మొదటిరోజు సాయంత్రం వరకు జమ్మలమడుగు ఇంఛార్జ్ వ్యవహారంపై సుదీర్ఘంగా జిల్లా నేతలతో పాటు జమ్మలమడుగు నేతలతో ఆయన చర్చించారు వైఎస్ జనగ్.. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య కుదిరించడానికి కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడు మండలాలు ,ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మూడు మండలాలు ఇన్చార్జిగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవ రోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యలను సానుకూలంగా విని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడవరోజు తెల్లవారుజామునే పులివెందుల నుంచి ఇరుగులపై చేరుకొని మరో మారు జమ్మలమడుగు నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ క్యాడర్ కు ఆయన ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!