YS Avinash Reddy: సాగునీటి సంఘాల ఎన్నికల వివాదం.. వేములలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్
- సాగునీటి సంఘాల ఎన్నికలతో వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాదం..
- నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్..
- వేములలో ఉద్రిక్త .. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Avinash Reddy: సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వేముల మండలంలో రైతులను తహసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆయన అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను తహసిల్దార్ కార్యాలయం నుంచి బయటికి పంపే వరకు తాను కూడా కదలనని పోలీస్ స్టేషన్లో భీష్మించుకుని కూర్చున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. అయితే, ఇరు వర్గాలు భారీగా మోహరించడంతో వేముల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో రైతులు ఓట్లు వేస్తే గెలవలేమని భయంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Bomb Threat In Delhi: ఢిల్లీలోని మరో 3 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Also Read
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
- Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు అవినాష్ రెడ్డి.. ఉచిత పంటల బీమాకు ఇవాళ రైతులు వద్ద నుంచి ప్రీమియం కట్టించుకుంటున్నారు.. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు… పోలీసులను అడ్డుపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నారు.. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు అని హెచ్చరించారు.. 2022వ సంవత్సరంలో జరిగిన ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయో గుర్తుపెట్టుకోవాలి… మేం అధికారంలో ఉన్నప్పుడు మీలాగా పోలీసులను వాడలేదు.. మా ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్ వేసి ఎన్నికల్లో పాల్గొన్నారు.. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు.. కాగా, రేపు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.. జిల్లాలోని 14 చెరువులు, 17 డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.. కడపజిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు.. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారు.. రైతులు వద్ద నుంచి నీటి పన్ను కట్టించుకోవడానికి వీఆర్వోలు నిరాకరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి.. అయితే, వేములలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
-
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
-
Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!