ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో సోమవారం జరిగిన పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ కాబూల్లోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5లో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన దుకాణదారుడు అహ్మద్ ముర్తాజా వార్తా సంస్థ రాయిటర్స్తో మాట్లాడుతూ, తాను కస్టమర్తో బిజీగా ఉన్నానని, “తన స్టోర్ను కదిలించిందని చెప్పాడు”. పేలుడు జరిగిన…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి…
అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్ ఎయిర్పోర్టులో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. తాలిబన్లు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయ్. విమానాశ్రయం లోపల తాలిబన్లు…హాయిగా సేద తీరుతున్నారు. నాటో దళాలు ఉపయోగించిన ప్రత్యేక దుస్తులు, ఇతర సామాగ్రి…చిందరవందరగా పడిపోయింది. బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయ్. వీటిలో పనికి వచ్చే వాటిని…తాలిబన్లు ఏరుకుంటున్నారు. యుద్దానికి ఉపయోగించిన హెలికాప్టర్లు పనికిరాకుండా పోయాయ్. జీపులు, ట్రక్కులు…ధ్వంసమయ్యాయి. తాజాగా కాబుల్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం…తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ…
రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్లో రక్షణ బాధ్యతలు నిర్వహించిన అమెరికా, ఇటీవలే ఆ దేశం నుంచి పూర్తిగా తప్పుకున్నది. అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి. పూర్తిగా వైదొలిగిన తరువాత, తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా వదలి వెళ్లిన ఆయుధ సామాగ్రిని తాలిబన్ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ఆయుధాలను, ప్రజలను, సైనికులను తరలించిన అమెరికా, ఎన్నో ఏళ్లపాటు వారితో కలిసి పనిచేసిన జాగిలాలను కాబూల్ ఎయిర్పోర్టులోనే వదలి వెళ్లారు. దీంతో ఆ జాగిలాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జాగిలాలలను అలా…
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ను అమెరికా దళాలు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన తరువాత ఎయిర్పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. రాత్రి తాలిబన్ దళాలు ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించాయి. ఈ తరువాత తాలిబన్లు తయారు చేసిన బద్రి 313 ఫోర్స్ దళాలు కాబూల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్లి అనువణువును గాలించాయి. తాలిబన్ నేతలు కార్లలో వెళ్లి పరిశీలిస్తే, కొంతమంది మాత్రం ఎయిర్పోర్ట్లోకి సైకిళ్లపై వెళ్లారు. ట్రాక్పై రౌండ్లు వేశారు. దీనికి సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ…
ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ను ఆమెరికా పూర్తిగా ఖాళీచేసి వెళ్లిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్పోర్ట్ను పూర్తిగా ఖాళీచేసింది. చివరి సైనికుడితో అంతా ఎయిర్పోర్ట్ను వదలి వెళ్లిపోయారు. అనంతరం తాలిబన్లు ఎయిర్పోర్ట్ను స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ కేరింతలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబన్ నేతలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించారు. ఎయిర్పోర్ట్ మొత్తం కలియదిరిగారు. దేశంలోని ప్రజలందరినీ క్షమించేశామని, పౌరులను భద్రంగా…
ఓ వైపు అమెరికా తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. 31 తరువాత అమెరికా లేని ఆఫ్గానిస్తాన్ని ప్రపంచం చూస్తుంది. కానీ ఆఫ్గన్ ప్రజలకు మాత్రం మళ్లీ నరకం మొదలవుతుంది. మళ్లీ అంతర్యుద్ధంతో అట్టుడుకుతుంది. ఉగ్రతండాలు ఊళ్లకు ఊళ్లను కభళిస్తాయి. అందుకే ఇప్పుడే ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు ఆఫ్ఘన్ ప్రజలు. అందుకోసం దారులు వెతుకుతున్నారు. చావటానికైనా సిద్ధమే కానీ నరకూపం లాంటి చోట ఉండలేమని సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. నరకకూపం లాంటి ఆఫ్గనిస్తాన్లో ఉండటానికి అక్కడి ప్రజలు…
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి.…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలు తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా హింస సాగుతోంది.. వరుసగా బాంబు పేలుళ్లు కాబూల్ వాసులను వణికిస్తున్నాయి.. ఇప్పటికే కాబూల్ ఎయిర్పోర్ట్లో ఐసిస్ జరిపిన దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 180 దాటిపోగా.. మరోసారి కాబూల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది అమెరికా.. కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రాగల 24…
ఐసిస్పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. కాబూల్ పేలుళ్లకు పాల్పడ్డ ఐసిస్-కె టెర్రరిస్టులపై డ్రోన్ దాడులు జరిపింది. పేలళ్ల బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి చంపుతాం అని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది. శనివారం తూర్పు ఆఫ్గనిస్తాన్లోని నంగర్హార్ ప్రావిన్స్లో డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్స్టేట్ తీవ్రవాదుల అడ్డాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాబూల్ పేలుళ్ల మాస్టర్మైండ్ హతమయ్యాడు. అయితే దీనిని అమెరికా సైనిక అధికారులు…