ఎస్కేఫ్ ఫ్రమ్ కాబూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు అమెరికా తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. 31 తరువాత అమెరికా లేని ఆఫ్గానిస్తాన్ని ప్రపంచం చూస్తుంది. కానీ ఆఫ్గన్ ప్రజలకు మాత్రం మళ్లీ నరకం మొదలవుతుంది. మళ్లీ అంతర్యుద్ధంతో అట్టుడుకుతుంది. ఉగ్రతండాలు ఊళ్లకు ఊళ్లను కభళిస్తాయి. అందుకే ఇప్పుడే ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు ఆఫ్ఘన్ ప్రజలు. అందుకోసం దారులు వెతుకుతున్నారు. చావటానికైనా సిద్ధమే కానీ నరకూపం లాంటి చోట ఉండలేమని సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు.
నరకకూపం లాంటి ఆఫ్గనిస్తాన్లో ఉండటానికి అక్కడి ప్రజలు ఇష్ట పడటం లేదు. ఎలాగైనా దేశ సరిహద్దులు దాటాలని ప్రయత్నిస్తున్నారు. విమానంలో వెళ్లటానికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బార్డర్ల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నట్టు సమాచారం.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రజలు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. శరణార్థులుగా మారుతున్నారు. వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా తన మిలటరీ బేస్లలో ఆశ్రయం కల్పిస్తోంది. మిడిల్ ఈస్ట్, యూరప్లోని పలు ఏర్ బేస్లలో వీరికి ఆశ్రయం కల్పిస్తోంది. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ రిస్క్లో ఉన్న వారిని దేశం నుంచి తరలిస్తున్నారు. వివిధ దేశాలలో అమెరికాకు ఉన్న సైనిక స్థావరాలలో కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించవచ్చు. పొరుగు దేశాలు అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.
రేపటి ఆఫ్గనిస్తాన్ ఎలావుంటుందో తాజా ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఉగ్రగ్రూపుల యుద్ధ భూమిగా మారుతుంది…ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువు.. సగటు ఆఫ్గనీ పౌరుడి ఆందోళన ఇది. దాదాపు ఐదు లక్షల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం (UNHCR) ఈ అంచనా వేసింది. అఫ్గాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నెలకొన్న అనిశ్చితి పరిస్థితితే దీనికి కారణం. అందుకే వీరందరూ దేశం నుంచి తప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపింది.
ఇప్పటికే అఫ్గాన్కు చెందిన దాదాపు 22లక్షల మంది విదేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. అంతేకాకుండా ఆఫ్గన్ అంతర్యుద్ధం వల్ల ఒక్క ఈ ఏడాదిలోనే 5 లక్షల 58 వేల మంది స్వదేశంలోనే ఒక చోటు నుంచి ఇకో చోటుకు మారారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువ. కేవలం స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని UNHCR తన నివేదికలో పేర్కొంది.
మరోవైపు తాలిబాన్లను నిధుల కొరత వేధిస్తోంది. ఆఫ్గన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. కాబూల్ని స్వాథీనం చేసుకున్నప్పటి నుంచి విదేశీ నిధులు ఆగిపోయాయి. దాంతో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది.బ్యాంకుల బయట జనం భారీగా గుమిగూడుతున్నారు.బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును ఎలాగైనా తిరిగి తీసుకోవాలని జనం ప్రయత్నిస్తున్నారు. నిరసనలు కూడా జరుగుతున్నాయి. ముందు ముందు పరిస్థితులు ఏ స్థాయికి దిగజారతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!