Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్లోని జేఎన్టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్,…
టీజీ ఎప్సెట్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ – హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎస్సెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 25వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను ఇతర వివరాలను రేపు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టీ కిషన్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా…
హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరంలో పర్యటించారు.
Hyderabad Students: హైదరాబాద్లోని అటు జేఎన్టీయూ, ఇటు ఓయూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్లో ఆహారం సరిగా లేదని జేఎన్టీయూ విద్యార్థినికులు నిరసన చేపట్టారు.
JNTU: జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కాలేజీల మార్పునకు అనుమతిస్తూ జేఎన్టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు, ఒక విశ్వవిద్యాలయం నుండి మరొక విశ్వవిద్యాలయానికి, స్వయంప్రతిపత్త కళాశాల నుండి నాన్-అటానమస్ కళాశాలకు బదిలీ చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు.
Anantapur JNTU: అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో విషాదం నెలకొంది. యూనివర్సిటీలోని ఎల్లోరా హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈసీఈ రెండో సంవత్సరం చదవువుతోన్న విద్యార్థి చాణక్య నందారెడ్డిగా గుర్తించారు యూనివర్సిటీ సిబ్బంది.. 19 ఏళ్ల చాణక్య.. ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.. రాత్రి స్నేహితులందరితో మాట్లాడి…