CM Revanth Reddy: ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం శుభవార్త..
- హైదరాబాద్ జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరంత ఫీజు రీయింబర్స్మెంట్ పై మా పాలసీ ఏంటని ఆలోచిస్తున్నారు.. కారు ఎంత పెద్దది ఐనా.. దాంట్లో ఇంధనం ఉంటేనే విలువ అని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం సంక్షేమం మీదనే ఎక్కువ దృష్టి సారిస్తోంది.. అభివృద్ధి రెండో ప్రాధాన్యతగా మారిందని తెలిపారు.
Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!
Also Read
- Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
కొంత ఆర్థిక భారంతో రాష్ట్రం ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొండిబకాయల కింద పడిందని సీఎం రేవంత్ తెలిపారు. మీరంతా ఆలోచించి వన్ టైం సెటిల్మెంట్ కి వస్తే బాగుంటుందన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నానన్నారు. ఈ ఏడాది నుంచి చేరే విద్యార్థులకు రెగ్యులర్ గా ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపారు. ప్రతీ ఏటా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్ష మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారని సీఎం చెప్పారు. ఈ లోపం మీలో.. మాలో ఉందన్నారు. దాన్ని గుర్తించి సమస్యను పరిష్కరిద్దామని విద్యార్థులకు సూచించారు.
CM Revanth: గ్రూప్-1పై కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ
ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువతను ఉత్పత్తి చేసే కర్మాగారంగా కాకుండా ఉపాధిని కల్పించే వేదికలుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సివిల్ ఇంజనీర్ల కొరత చాలా ఉంది.. కానీ కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేసే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్లను తప్పనిసరిగా తయారు చేయండని యాజమాన్యాలకు సూచించారు. లేదంటే భవిష్యత్తులో దేశం ఇబ్బందులకు గురవుతుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన మూడు కంపెనీలు తెలంగాణలోనివేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
-
CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
-
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
-
Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!