Hyderabad Students: అటు జేఎన్టీయూ.. ఇటు ఓయూ.. విద్యార్థినుల ఆందోళనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Students: హైదరాబాద్లోని అటు జేఎన్టీయూ, ఇటు ఓయూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్లో ఆహారం సరిగా లేదని జేఎన్టీయూ విద్యార్థినికులు నిరసన చేపట్టారు. మరోవైపు ఓయూలో రాత్రి పూట కొందరు దండగులు గది డోర్ లు కొడుతున్నారని గేట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ.. తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా ఆహారం అందడం లేదంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ అంటూ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళితే.. సాయంత్రం 6 గంటలలోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నారు? కాలేజీలో ఎక్కడపడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని అన్నారు. హాస్టల్ మెస్ సరిగా లేదని, మెస్లోనే లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ని ప్రశ్నించగా.. మీ కోసం ఇంద్ర భవనం కట్టలేమని హేళనగా చెబుతున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తానని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. ఇక మరోవైపు ఓయూ విద్యార్థుల మాట్లాడుతూ.. ఓయూ లేడీస్ హాస్టల్లో రాత్రిపూట కొందరు దుండగులు గది తలుపులు కొడుతున్నారని దీంతో భాయాందోళనకు గురవుతున్నామని అన్నారు. లేడీస్ హాస్టల్ వైపు రాత్రి పూట ఏం జరుగుతుందో అని భయాందోళనకు చెందుతున్నామని అన్నారు. హాస్టల్లో సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఓయూ గేట్లను మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీసీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి వారికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Tirumala: డిసెంబర్లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!