Hyderabad Students: అటు జేఎన్టీయూ.. ఇటు ఓయూ.. విద్యార్థినుల ఆందోళనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Students: హైదరాబాద్లోని అటు జేఎన్టీయూ, ఇటు ఓయూ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ మెస్లో ఆహారం సరిగా లేదని జేఎన్టీయూ విద్యార్థినికులు నిరసన చేపట్టారు. మరోవైపు ఓయూలో రాత్రి పూట కొందరు దండగులు గది డోర్ లు కొడుతున్నారని గేట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ.. తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు సరిపడా ఆహారం అందడం లేదంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ అంటూ ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళితే.. సాయంత్రం 6 గంటలలోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నారు? కాలేజీలో ఎక్కడపడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని అన్నారు. హాస్టల్ మెస్ సరిగా లేదని, మెస్లోనే లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ని ప్రశ్నించగా.. మీ కోసం ఇంద్ర భవనం కట్టలేమని హేళనగా చెబుతున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తానని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. ఇక మరోవైపు ఓయూ విద్యార్థుల మాట్లాడుతూ.. ఓయూ లేడీస్ హాస్టల్లో రాత్రిపూట కొందరు దుండగులు గది తలుపులు కొడుతున్నారని దీంతో భాయాందోళనకు గురవుతున్నామని అన్నారు. లేడీస్ హాస్టల్ వైపు రాత్రి పూట ఏం జరుగుతుందో అని భయాందోళనకు చెందుతున్నామని అన్నారు. హాస్టల్లో సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఓయూ గేట్లను మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీసీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి వారికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Tirumala: డిసెంబర్లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!