Champai Soren flew to Delhi: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు ఉన్నాయి. చంపైతో పాటు పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారని సమాచారం. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపై బీజేపీలో…
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. శుక్రవారం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల సంఘం ప్రత్యేక సన్నాహాలు చేసింది.
జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
జార్ఖండ్లోని హజారీబాగ్లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్సభలో బడ్జెట్పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో…
జార్ఖండ్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి…
ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు.