Asaduddin Owaisi: బీజేపీపై మండిపడ్డ అసదుద్దీన్.. ఆ ప్రమాదాలకు ప్రభుత్వం తప్పిదం..!
- బీజేపీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
- జార్ఖండ్లో జరిగిన రైలు ప్రమాదంపై తీవ్ర విమర్శలు
- రైలు ప్రమాదాల్లో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉంది- అసదుద్దీన్
- ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది- అసదుద్దీన్.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్సభలో బడ్జెట్పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని.. రైల్వే ఆస్తులు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మరోవైపు.. బీజేపీ కూడా రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
Read Also: CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన
Also Read
మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ‘ముఖ్యమైన ప్రశ్నలకు బీజేపీకి సమాధానాలు చెప్పనప్పుడు, పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఎవరి పేరునైనా తీసుకోవడానికి అభ్యంతరాలు నమోదు చేయడం ప్రారంభిస్తాయి. రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా ఉన్నారు. పార్లమెంటు పనితీరు ఆయనకు బాగా తెలుసు’. అని అన్నారు. మరోవైపు.. వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక కారణం తనకు తెలియదని అన్నారు. కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Read Also: Water health: నీరు తగినంత తాగకపోతే వచ్చే నష్టాలివే..!
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!