Champai Soren: బీజేపీ ఒక్కటే ఆదివాసీల గురించి పోరాడుతోంది.. ఇండీ కూటమిపై ఫైర్..
- బీజేపీ ఒక్కటే ఆదివాసీల గురించి పోరాడుతోంది..
- గిరిజన ప్రాంతాల్లోకి బంగ్లాదేశీయుల చొరబాట్లు..
- ఓట్ల కోసమే ఇతర పార్టీల ప్రయత్నం..
- బీజేపీలో చేరిక ముందు చంపాయ్ సోరెస్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం ఖరారైంది. బీజేపీలో చేరాలనే తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. గిరిజనుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. సంతాల్ పరగణాలో గిరిజనులు గుర్తింపును రక్షించేందుకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, గిరిజన హక్కుల కోసం పాటుపడాలని తన మద్దతుదారుల్ని కోరారు. చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు.
Read Also: Minu Muneer: “హగ్ చేసుకొని ముద్దు పెట్టారు”.. లైంగిక వేధింపులపై నటి సంచలనం
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఆదివాసీల గుర్తింపు, అస్తిత్వాన్ని కాపాడే ఏకైక పార్టీ బీజేపీనే అని ట్వీట్ చేశారు. ఇతర పార్టీలు ఓట్ల కోసమే ఆరాటపడుతున్నాయని కాంగ్రెస్, జేఎంఎం పరోక్షంగా విమర్శించారు. గిరిజనుల కోసం మాట్లాడుతూ.. బాబా తిల్కా మాంఝీ, సిడో-కాన్హుల పుణ్యభూమి అయిన సంతాల్ పరగణాలో నేడు బంగ్లాదేశ్ చొరబాట్లు పెద్ద సమస్యగా మారాయని, ఈ చొరబాటుదారులు ఆక్రమించుకోవడం కంటే దురదృష్టం ఏముంటుంది..? నీరు, అడవి, భూమి కోసం విదేశీ బ్రిటీష్ వారి బానిసత్వాన్ని ఎన్నడూ అంగీకరించని ఈ భూమి పుత్రులు మన తల్లులు, సోదరీమణుల, కుమార్తెల గౌరవం ప్రమాదంలో పడినప్పుడు ఎలా చూస్తూ ఊరుకుంటారని అన్నారు. రాజకీయాతోనే కాదు, సామాజిక ఉద్యమాల ద్వారా గిరిజనుల్ని రక్షించగలమని ఆయన పేర్కొన్నాడు.
జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలో సీఎం హేమంత్ సోరెన్ తర్వాత చంపాయ్ సోరెన్ కీలక నేతగా ఉన్నారు. భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో చంపాయ్ సోరెన్ సీఎం అయ్యారు. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తనను అవమానకరమైన రీతిలో సీఎం పదవి నుంచి దించారని చంపాయ్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా కేబినెట్ మీటింగ్, ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన బీజేపీలో చేరబోతున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!