Araku Coffee: చాలా మంది ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగనిదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్ను అరకు కాఫీ విదేశీ మార్కెట్లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా…
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్ల బిడ్లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి.
Typhoon Nanmadol: జపాన్ దేశాన్ని అత్యంత శక్తివంతమైన తుఫాన్ నన్మదోల్ భయపెడుతోంది. తీరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తీర ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నన్మదోల్ టైఫూన్ వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో రవాణా సేవలు స్తంభించాయి. నైరుతి జపాన్ లోని కగోషిమా ప్రిపెక్చర్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో భారీగా గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు సముద్రంలో ఎతైన అలలు వస్తున్నాయి.…
Earthquake Hits Taiwan: తైవాన్ తీరం ఉలిక్కిపడింది. ఆదివారం తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృతం అయిందని తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.2 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. అయితే దీన్ని ఆ తరువాత 6.9 మాగ్నిట్యూడ్ కు తగ్గించింది. భారీ భూకంపం సంభవించడంతో జపాన్ సునామీ హెచ్చరికలను జారీ…
వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మద్యం తాగండి అని యువతను రిక్వెస్ట్ చేస్తోంది జపాన్ ప్రభుత్వం.. లిక్కర్ ఆదాయం ప్రతీ ఏడాది భారీగా పడిపోవడంతో.. ఇప్పుడు మద్యం తాగండి అని ఆహ్వానిస్తోంది.. ఏకంగా పోటీలే పెడుతోంది..