PM Narendra Modi: సెప్టెంబర్ 27న షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికార వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అధికార వీడ్కోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో జరుగుతుంది. అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్రదేశాలలో ఒకటి. మోడీ, అబే పదవీకాలంతో పాటు తరువాత కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. 2018లో ప్రధాని మోదీ జపాన్ అధికారిక పర్యటన సందర్భంగా, అబే తన భారతీయ మిత్రుడిని యమనాషి ప్రిఫెక్చర్లోని తన ఇంటికి ఆహ్వానించారు, ఈ ఆహ్వానం ఇద్దరు నాయకుల మధ్య ప్రత్యేకించి స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది. క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని పదవీవిరమణ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత మేలో ప్రధాని మోదీ అబేతో సమావేశమయ్యారు. అబే హత్య తర్వాత, ప్రధాని మోడీ భారతదేశంలో ఒక రోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. సెప్టెంబరు 27న అబే అంత్యక్రియలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాజీ ప్రధానికి జరిగే రెండవ ప్రభుత్వ అధికార వీడ్కోలు కార్యక్రమం. మొదటిది 1967లో షిగేరు యోషిదా కోసం జరిగింది.
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
Rajamouli: రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. రివీల్ చేసిన జక్కన్న
పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం అబే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!