PM Narendra Modi: సెప్టెంబర్ 27న షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికార వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అధికార వీడ్కోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో జరుగుతుంది. అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్రదేశాలలో ఒకటి. మోడీ, అబే పదవీకాలంతో పాటు తరువాత కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. 2018లో ప్రధాని మోదీ జపాన్ అధికారిక పర్యటన సందర్భంగా, అబే తన భారతీయ మిత్రుడిని యమనాషి ప్రిఫెక్చర్లోని తన ఇంటికి ఆహ్వానించారు, ఈ ఆహ్వానం ఇద్దరు నాయకుల మధ్య ప్రత్యేకించి స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది. క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని పదవీవిరమణ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత మేలో ప్రధాని మోదీ అబేతో సమావేశమయ్యారు. అబే హత్య తర్వాత, ప్రధాని మోడీ భారతదేశంలో ఒక రోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. సెప్టెంబరు 27న అబే అంత్యక్రియలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాజీ ప్రధానికి జరిగే రెండవ ప్రభుత్వ అధికార వీడ్కోలు కార్యక్రమం. మొదటిది 1967లో షిగేరు యోషిదా కోసం జరిగింది.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
Rajamouli: రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. రివీల్ చేసిన జక్కన్న
పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం అబే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!