PM Narendra Modi: సెప్టెంబర్ 27న షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికార వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అధికార వీడ్కోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో జరుగుతుంది. అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్రదేశాలలో ఒకటి. మోడీ, అబే పదవీకాలంతో పాటు తరువాత కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. 2018లో ప్రధాని మోదీ జపాన్ అధికారిక పర్యటన సందర్భంగా, అబే తన భారతీయ మిత్రుడిని యమనాషి ప్రిఫెక్చర్లోని తన ఇంటికి ఆహ్వానించారు, ఈ ఆహ్వానం ఇద్దరు నాయకుల మధ్య ప్రత్యేకించి స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది. క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని పదవీవిరమణ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత మేలో ప్రధాని మోదీ అబేతో సమావేశమయ్యారు. అబే హత్య తర్వాత, ప్రధాని మోడీ భారతదేశంలో ఒక రోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. సెప్టెంబరు 27న అబే అంత్యక్రియలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాజీ ప్రధానికి జరిగే రెండవ ప్రభుత్వ అధికార వీడ్కోలు కార్యక్రమం. మొదటిది 1967లో షిగేరు యోషిదా కోసం జరిగింది.
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
Rajamouli: రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. రివీల్ చేసిన జక్కన్న
పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం అబే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!