PM Narendra Modi: సెప్టెంబర్ 27న షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
PM Narendra Modi: వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికార వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అధికార వీడ్కోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో జరుగుతుంది. అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్రదేశాలలో ఒకటి. మోడీ, అబే పదవీకాలంతో పాటు తరువాత కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. 2018లో ప్రధాని మోదీ జపాన్ అధికారిక పర్యటన సందర్భంగా, అబే తన భారతీయ మిత్రుడిని యమనాషి ప్రిఫెక్చర్లోని తన ఇంటికి ఆహ్వానించారు, ఈ ఆహ్వానం ఇద్దరు నాయకుల మధ్య ప్రత్యేకించి స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది. క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని పదవీవిరమణ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత మేలో ప్రధాని మోదీ అబేతో సమావేశమయ్యారు. అబే హత్య తర్వాత, ప్రధాని మోడీ భారతదేశంలో ఒక రోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. సెప్టెంబరు 27న అబే అంత్యక్రియలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాజీ ప్రధానికి జరిగే రెండవ ప్రభుత్వ అధికార వీడ్కోలు కార్యక్రమం. మొదటిది 1967లో షిగేరు యోషిదా కోసం జరిగింది.
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
Rajamouli: రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. రివీల్ చేసిన జక్కన్న
పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం అబే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
-
Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!