UN Security Council: ఐరాస భద్రతామండలిలో భారత్కు శాశ్వత స్థానం కల్పించేందుకు శ్రీలంక మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్ల బిడ్లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన అధ్యక్షుడు విక్రమసింఘే ప్రస్తుతం జపాన్లో ఉన్నారు. మంగళవారం జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో జరిగిన సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ.. “అంతర్జాతీయ వేదికపై జపాన్ శ్రీలంకకు అందించిన మద్దతును ప్రశంసించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, భారతదేశం చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేశారు. ” అని రాష్ట్రపతి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. . ఈ ఐదు దేశాల్లో ఇప్పటికి నాలుగు దేశాలు భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు తెలిపాయి. కేవలం ఒక చైనా మాత్రమే అడ్డుకుంటోంది. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది.
Also Read
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరొకరు అరెస్ట్
శాశ్వత దేశాలైన రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేయగలవు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నుకోబడిన తాత్కాలిక శాశ్వత సభ్యదేశమైన భారతదేశం తన రెండేళ్ల పదవీ కాలం డిసెంబర్లో ముగియనుంది.
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!