తక్కువ సయమంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలో తనకంటూ ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో సమావేశం అయ్యారు మోదీ. ఇండో పసిఫిక్ రిజియన్ భద్రతపై నాలుగు దేశాధినేతలు చర్చించారు. క్వాడ్ పరిధివిస్తృతమైందని మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, మా సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని…
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40…
ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవడం లేదు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరికలు చేసింది. దీనికి అనుగుణంగానే ఉత్తర కొరియా తన వైఖరిని చాటుకుంటోంది. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పక్కనపెట్టి క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తరకొరియా తాజాగా నిన్న జలాంతర్గామి…
ప్రాణం ఉన్న వ్యక్తులు హావభావాలు పలికించడం చాలా కష్టం. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రాణం లేని బొమ్మలు సైతం మనిషికి ఔరా అనిపించే విధంగా హావభావాలు పలికిస్తున్నాయట. దీనిని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిపేరు ఆండ్రాయిడ్ నికోలా కిడ్. మనుషులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ రోబోలను తయారు చేశారట. ఈ ఆండ్రాయిడ్ నికోలా కిడ్ 6 రకాల హావభావాలను పలికించగలదు. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం,…
ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్…
దేశంలోని ప్రజల కోసం ఒకవైపు ఆహారాన్ని సమకూర్చుకుంటూనే, మరోవైపు క్షిపణీ ప్రయోగాలు చేస్తున్నది ఉత్తర కొరియా. 2022 జనవరిలో ఇప్పటి వరకు మొత్తం 7 క్షిపణీ ప్రయోగాలు చేపట్టింది. ఆదివారం ఉదయం సమయంలో ఉత్తర కొరియా భారీ క్షిపణిని ప్రయోగించి షాకిచ్చింది. ఇప్పటి వరకు స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా 2017 తరువాత మరోసారి భారీ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భూమినుంచి 2000 కిమీ ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి జపాన్ సముద్రంలో…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు “నేతాజీ అవార్డు 2022″ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ…
ఉత్తర కొరియా అధ్యక్షుడు మళ్లీ పాతపద్దతికే వచ్చేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా కాస్త తగ్గినట్టు కనిపించినా… ఆ తరువాత తగ్గేది లేదని కిమ్ చెప్పకనే చెప్పాడు. వారం క్రితం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి భయపెట్టిన కిమ్, మరోసారి క్షిపణీ ప్రయోగం చేసి షాక్ ఇచ్చాడు. 700 కిమీ పరిధిలోని లక్ష్యాలను చేధించగల శక్తి గలిగిన ఈ బాలిస్టిక్ క్షపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా…
“బాహుబలి” చిత్రం జపాన్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ కు జపనీస్ యూత్ ఫిదా అయిపోయారు. ‘బాహుబలి’ నుంచి జపనీస్ ప్రేక్షకులలో ఒక వర్గం, అలాగే జపనీస్ మీడియా, ‘బాహుబలి’ స్టార్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు. ‘[బాహుబలి’ విడుదలై ఏళ్ళు గడుస్తున్నా అక్కడ ఇంకా ప్రభాస్ క్రేజ్ తగ్గనేలేదు. ఇప్పుడు కూడా ‘రాధే శ్యామ్’ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ పై వారు తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు.…
ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణాలు చేయడం కష్టంగా మారింది. ప్రపంచంలో జనాభా ఎక్కువగా వుండే దేశాల్లో అయితే బహుళ ప్రయోజనకర వాహనాలు తెరమీదకు వస్తున్నాయి. నీటిలో, నేలపై నడిచే కార్లు అన్నమాట. ఇప్పుడు పట్టాలపై నడుస్తూ.. అవసరమయితే రోడ్లమీద పరుగులు పెట్టే రైల్ కం బస్సుల ఆవశ్యకత ఎంతో వుంది. ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సు తెరమీదకు వచ్చింది. దీనిని డ్యూయల్ మోడ్ వాహనం అండే డీఎంవీ అనవచ్చన్నమాట. డీఎంవీ ఒక…