Jammu Kashmir: కాశ్మీర్ పై పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేఖించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీకల్లోతు ఆర్థిక సమస్యలు, అంతర్గత, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల డీలిమిటేషన్ పై వ్యతిరేఖంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖించింది ఇండియా. భారత దేశంలో భాగం అయిన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కు వ్యతిరేఖంగా పాక్ చేసిన తీర్మానాన్ని హస్య తీర్మాణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత భూభాగాలతో సహా భారత దేశ అంతర్గత విషయాల్ల జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ కు అర్హత లేదని గట్టిగా చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్మూ కాశ్మీర్ పై అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత డీలిమిటేషన్ చేస్తున్నామని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. కొత్తగా డీలిమిటేషన్ తరువాత కాశ్మీర్ లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్ నాగ్ -రాజౌరీ, ఉదంపూర్ , జమ్మూలు ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలుగా ఏర్పడనున్నాయి.
కాగా అంతకుముందు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్( ఓఐసీ) వ్యాఖ్యలను కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేఖించింది. ఒక దేశం ఆదేశాలతో మతపరమైన ఎజెండాను అమలు చేయవద్దని ఓఐసీని కోరింది. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వ్యవహారంపై భారత్ ను వ్యతిరేఖిస్తూ… ఐఓసీ చేసిన వ్యాఖ్యలు భారత్ తీవ్రంగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాలపై ఓఐసీ మరోసారి అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికింది భారత విదేశాంగ శాఖ.
Also Read
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
భారతదేశంలోని అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై ఓఐసీ సెక్రటేరియట్ చేసిన వాదనలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సరిహద్దులను తిరిగి గీయడానికి భారత దేశం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని.. ఇది కాశ్మీరీ ప్రజల హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించింది ఓఐసీ. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. జమ్మూకాశ్మీర్, లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమే అని భారత ప్రభుత్వం పేర్కొంది. పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేఖించిది ఇండియా.
తాజావార్తలు
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!