Jammu Kashmir: కాశ్మీర్ పై పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేఖించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీకల్లోతు ఆర్థిక సమస్యలు, అంతర్గత, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల డీలిమిటేషన్ పై వ్యతిరేఖంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖించింది ఇండియా. భారత దేశంలో భాగం అయిన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కు వ్యతిరేఖంగా పాక్ చేసిన తీర్మానాన్ని హస్య తీర్మాణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత భూభాగాలతో సహా భారత దేశ అంతర్గత విషయాల్ల జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ కు అర్హత లేదని గట్టిగా చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్మూ కాశ్మీర్ పై అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత డీలిమిటేషన్ చేస్తున్నామని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. కొత్తగా డీలిమిటేషన్ తరువాత కాశ్మీర్ లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్ నాగ్ -రాజౌరీ, ఉదంపూర్ , జమ్మూలు ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలుగా ఏర్పడనున్నాయి.
కాగా అంతకుముందు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్( ఓఐసీ) వ్యాఖ్యలను కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేఖించింది. ఒక దేశం ఆదేశాలతో మతపరమైన ఎజెండాను అమలు చేయవద్దని ఓఐసీని కోరింది. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వ్యవహారంపై భారత్ ను వ్యతిరేఖిస్తూ… ఐఓసీ చేసిన వ్యాఖ్యలు భారత్ తీవ్రంగా ఖండించింది. భారత అంతర్గత వ్యవహారాలపై ఓఐసీ మరోసారి అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికింది భారత విదేశాంగ శాఖ.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
భారతదేశంలోని అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై ఓఐసీ సెక్రటేరియట్ చేసిన వాదనలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సరిహద్దులను తిరిగి గీయడానికి భారత దేశం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని.. ఇది కాశ్మీరీ ప్రజల హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించింది ఓఐసీ. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. జమ్మూకాశ్మీర్, లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమే అని భారత ప్రభుత్వం పేర్కొంది. పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేఖించిది ఇండియా.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!