PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) భారత్లో విలీనం అవుతుంది.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్లో విలీనం కావాలనే డిమాండ్ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాశ్మీర్పై పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘వాళ్లు కాశ్మీర్ని ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా.? వారు పీఓకే గురించి ఆందోళన చెందాలి. అక్కడి ప్రజలు భారత్లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోందని నేను ఏడాదిన్నర క్రితమే చెప్పాను’’అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వం ఏదైనా ప్రణాళికను రూపొందిస్తుందా?? అనే ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకేమి చెప్పను. మేం ఏ దేశంపైనా దాడి చేయబోవడం లేదు. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయని లక్షణం భారత్కి ఉంది. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూమిని భారత్ ఎప్పుడూ ఆక్రమించలేదు. కానీ పీఓకే మనది, అది స్వయంగా భారత్లో విలీనం అవుతుందనే నమ్మకం నాకు ఉంది’’ అని చెప్పారు. ఫిబ్రవరి నెలలో పీఓకేలోని రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారని, వారు ఇప్పుడు భారత్లో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: Kamal Haasan: రాముడు అగ్నిపరీక్ష నిర్వహించినట్లే.. ఈవీఎంలను పరీక్షిస్తాం..
భారత్పై చైనా దాడి చేస్తుందా..? అని అడిగిన ప్రశ్నకు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి తప్పులు చేయవద్దనే బుద్ధి ఆ దేశానికి ఇవ్వాలని, ఏ దేశంపైనా దాడులు చేయని గుణం భారత్లో ఉందని, అయితే మన దేశంపై దాడి చూస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. మన పొరుగువారితో మంచి సంబంధాలు ఉండాలని ఆయన కాంక్షించారు. దేశం ప్రతిష్టపై, దేశంపై దాడి చేసేవారికి బుద్ధి చెప్పే శక్తి భారత్కి ఉందన్నారు. చైనా నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనే సత్తా భారత్కి ఉందన్నారు. భారత్ బలహీన దేశం కాదని, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు.
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను వేగవంతం చేసిందని రాజ్ నాథ్ చెప్పారు. జవాన్ల త్యాగాలను రాహుల్ గాంధీ లాంటి వారు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. గాల్వాన్ పోరాటంలో మన జనాన్లు 20 మంది మరణించారు. అయితే, విదేశీ సంస్థలు మాత్రం ఈ ఘర్షణలో 35 నుంచి 40 మంది చైనా సైనికులు మరణించినట్లు చెబుతున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!