Lok Sabha Election: గురువారం లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election: లోక్సభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత గురువారం లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నెలలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈసీ అధికారులు పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఒకేసారి నిర్వహించవచ్చో..? లేదో.. అనే విషయాన్ని అంచనా వేయాలని కేంద్రం ఈసీని కోరింది. బుధవారం పర్యటన ముగియగానే తర్వాతి రెండు రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడొచ్చని తెలుస్తోంది.
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
Read Also: Karnataka: పాక్ మద్దతుదారుల్ని కాల్చిపారేయాలి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయంలో భద్రతా యంత్రాంగం అన్ని వివరాలను ఈసీకి అందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్తో సహా మొత్తం ప్యానెల్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్-లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు.
అయితే, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, జమ్మూకాశ్మీర్లో సెప్టెంబర్ నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని గతేడాది డిసెంబర్లో ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
మరోవైపు ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ తన 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఇక ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్పై మిత్ర పక్షాలతో చర్చిస్తోంది.
తాజావార్తలు
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!