Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..
- ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు..
- ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అందుబాటులోకి..
- రూ.3 వేల నుంచి రూ.3075 చేరిన కొత్త ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ప్రస్తుతం వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉండగా.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది 2.5 శాతం పెరిగి రూ. 3,075 కానుంది. రహదారుల నిర్వహణ , టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ పెంపును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పటికీ పాత ధరకే అంటే రూ. 3,000కే పాస్ను పొందాలనుకునే వాహనదారులు.. ఈ నెలాఖరు (మార్చి 31) లోపు రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు.
Also Read:Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఈ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ ఒక సంవత్సరం కాలపరిమితి వరకు ఉంటుంది లేదా గరిష్టంగా 200 టోల్ ప్లాజాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పూర్తికాక ముందే 200 టోల్ ప్లాజాలను దాటితే.. పాస్ గడువు ముగిసినట్లుగా పరిగణించబడుతుంది. టోల్ గేట్ల వద్ద ఆగకుండా.. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 52 లక్షల మందికి పైగా వాహనదారులు దీనిని వినియోగించుకుంటున్నారు.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
పాస్ పొందడం ఎలా..?
మీ వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉన్నట్లయితే, మీరు సులభంగా యాన్యువల్ పాస్ పొందవచ్చు. ముందుగా NHAI అధికారిక పోర్టల్లోకి లేదా మీ ఫాస్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ యాప్లోకి లాగిన్ అవ్వండి. ‘యాన్యువల్ పాస్’ ఆప్షన్ను ఎంచుకుని.. ఆన్లైన్ పేమెంట్ ద్వారా నిర్ణీత ఫీజును చెల్లించండి. చెల్లింపు పూర్తయ్యాక, పాస్ మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లను అమలు చేయాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. వీలైనంత త్వరగా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!