‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని,…
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది. కొన్ని దేశాలు మాత్రమే సెమీకండక్టర్లను తయారు చేస్తున్నాయి. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మారి కాలంలో ట్రాన్స్ఫోర్ట్ ఫెసిలిటీ తగ్గిపోవడంతో ఈ కొరత ఏర్పడింది. అంతేకాదు, పరిశ్రమలను మూసివేయడం కూడా ఇందుకు ఒక కారణం. ఈ కొరత తగ్గి తిరిగి యధాస్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. చాలా దేశాలు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు సెమీకండక్టర్లు తయారు చేస్తున్న…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ నుంచి అనేక కొత్త వేరియంట్లు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా ఫ్లోరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో తొలి ఫ్లోరోనా కేసు నమోదైంది. Read Also: భర్త ఆ పని చేయలేదని అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టిన భార్య ఫ్లోరోనా అంటే కోవిడ్-19 అని.. ఇది డబుల్ ఇన్ఫెక్షన్…
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది.. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో రెండో డోసు పంపిణీ చేయడంలో వేగం పెంచాయి. అలాగే మరి కొన్ని దేశాల్లో మూడో డోసు పంపిణీ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ ఇజ్రాయిల్ దేశ ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవడానికి ఏకంగా నాలుగో డోసు పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే ఇజ్రాయిల్లోని 150 మంది వైద్య సిబ్బందికి ఫైజర్ వ్యాక్సిన్ నాలుగో డోసును…
మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది భారత్.. మిస్ యూనివర్స్గా మిస్ ఇండియా ఎంపికైంది.. పంజాబ్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ.. ఈ టైటిల్ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ మూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్కౌర్ మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్లో 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం…
ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మిస్ ఇండియా పోటీల కోసం తాజాగా ఇజ్రాయెల్ చేరుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన…
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పటి వరకు ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా ఇలా టాప్ టెన్ నగరాల జాబితాలో ఉండేవి. అయితే, ఈసారి వీటన్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ నగరం. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్భణం పెరిగిపోవడం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవడం, ధరలు పెరిగిపోవడం, డాలర్తో అక్కడి కరెన్సీ మారక విలువ పెరగడం, డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ…