ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
గాజా నగరంపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నగరంలో ఉన్న టెర్రిస్టులను కనుగొనడానికి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది.
ఇజ్రాయెల్ దళాలు రఫా క్రాసింగ్లోని పాలస్తీనా భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో మంగళవారం ఈ విషయాన్ని పేర్కొంది. ధ్రువీకరణ కోసం ఇజ్రాయెల్ సైన్యం త్వరలో ఒక ప్రకటనను ప్రచురిస్తుందని తెలిపింది.
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలలకు పైగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.