Yemen-Israel: ఇజ్రాయెల్పై ప్రతీకారం..! యెమెన్ తిరుగుబాటుదారులు దాడి
- హమాస్-హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం
- ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
- ఈ క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.
గాజా, లెబనాన్లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్లో తెల్లవారుజామున చేసింది. గురువారం లెబనాన్లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ కమాండర్ మహ్మద్ సురూర్ మృతి చెందాడు. ఈ క్రమంలో.. యెమన్ దాడి చేసింది. కాగా.. సురూర్ హౌతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చాడు.
Read Also: China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
Also Read
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ఇజ్రాయెల్ మిలటరీ శుక్రవారం ఒక తాజా ప్రకటనలో.. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ యెమెన్ నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేసిందని పేర్కొంది. క్షిపణిని ధ్వంసం చేసిన తర్వాత.. దాని శిథిలాలు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పడిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఈ దాడి తర్వాత హోం ఫ్రంట్ కమాండ్ నుండి కొత్త సూచనలు లేవని IDF తెలిపింది.
Read Also: Kunki Elephants: కుదిరిన ఎంవోయూ.. దసరా తర్వాత ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు..
సురూర్ మరణానికి ప్రతీకారం
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు దాడికి బాధ్యత వహించారు. కానీ దాని వెనుక కారణాన్ని వెల్లడించలేదు. అయితే.. గురువారం లెబనాన్లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. గురువారం బీరుట్లోని నివాస భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడితో పేల్చివేసింది. హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ హుస్సేన్ సురూర్ భవనం లోపల ఉన్నట్లు వెల్లడైంది. ఈ దాడిలో సరూర్ చనిపోయాడు. హిజ్బుల్లా కూడా అతని మరణాన్ని ధృవీకరించింది.
צה"ל: האזעקות במרכז – עקב טיל ששוגר מתימן • תיעוד מקריית מלאכי >>
@Doron_Kadosh @galdjerassi pic.twitter.com/5l6XkXtxiC— גלצ (@GLZRadio) September 26, 2024
తాజావార్తలు
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!