Yemen-Israel: ఇజ్రాయెల్పై ప్రతీకారం..! యెమెన్ తిరుగుబాటుదారులు దాడి
- హమాస్-హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం
- ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
- ఈ క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా, లెబనాన్లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్లో తెల్లవారుజామున చేసింది. గురువారం లెబనాన్లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ కమాండర్ మహ్మద్ సురూర్ మృతి చెందాడు. ఈ క్రమంలో.. యెమన్ దాడి చేసింది. కాగా.. సురూర్ హౌతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చాడు.
Read Also: China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ఇజ్రాయెల్ మిలటరీ శుక్రవారం ఒక తాజా ప్రకటనలో.. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ యెమెన్ నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేసిందని పేర్కొంది. క్షిపణిని ధ్వంసం చేసిన తర్వాత.. దాని శిథిలాలు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పడిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఈ దాడి తర్వాత హోం ఫ్రంట్ కమాండ్ నుండి కొత్త సూచనలు లేవని IDF తెలిపింది.
Read Also: Kunki Elephants: కుదిరిన ఎంవోయూ.. దసరా తర్వాత ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు..
సురూర్ మరణానికి ప్రతీకారం
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు దాడికి బాధ్యత వహించారు. కానీ దాని వెనుక కారణాన్ని వెల్లడించలేదు. అయితే.. గురువారం లెబనాన్లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. గురువారం బీరుట్లోని నివాస భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడితో పేల్చివేసింది. హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ హుస్సేన్ సురూర్ భవనం లోపల ఉన్నట్లు వెల్లడైంది. ఈ దాడిలో సరూర్ చనిపోయాడు. హిజ్బుల్లా కూడా అతని మరణాన్ని ధృవీకరించింది.
צה"ל: האזעקות במרכז – עקב טיל ששוגר מתימן • תיעוד מקריית מלאכי >>
@Doron_Kadosh @galdjerassi pic.twitter.com/5l6XkXtxiC— גלצ (@GLZRadio) September 26, 2024
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!