Israel-Lebanon Tension: ‘‘తగ్గేదే లేదు, పూర్తిశక్తితో హిజ్బుల్లాపై దాడి చేయండి’’.. ఆర్మీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆదేశాలు..
- కాల్పుల విరమణ పిలుపుని పట్టించుకోని ఇజ్రాయిల్..
- హిజ్బుల్లాపై మరింత శక్తితో విరుచుకుపడాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశం..
- పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Lebanon Tension:ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇరు దేశాలు 21 రోజులు పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. అయితే, ఈ పిలుపుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించలేదు. మిత్ర దేశాల ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఇయన చెప్పారు.
Read Also: India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
Also Read
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
‘‘ఇది అమెరికా-ఫ్రాన్స్ ప్రతిపాదన, దీనికి ప్రధాని నెతన్యాహూ స్పందించలేదు’’ అని నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉంటే, హిజ్బుల్లాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సైన్యానికి నెతన్యాహూ పిలిపునిచ్చాడు. పూర్తి శకత్తితో దాడి చేయాలని సైన్యాన్ని గురువారం ఆదేశించాడు. లెబనాన్ పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తి చేశారు. దౌత్యపరంగా సమస్యని పరిష్కరించుకోవడానికి లెబనాన్-ఇజ్రాయిల్ సరిహద్దుల్లో తక్షణమే 21 రోజులు కాల్పుల విరమణ పాటించాలని మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జపాన్, గల్ఫ్ దేశాలు, అమెరికా కాల్పుల ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేశాయి.
ఇదిలా ఉంటే, లెబనాన్పై భూతల దాడులతో పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం సైనికులకు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సాధ్యమైన భూదాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీని తర్వాతే కాల్పుల విమరణ పాటించాలని పలు దేశాలు కోరాయి. ఇదిలా ఉంటే హిజ్బుల్లా బుధవారం టెల్ అవీల్లోని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మెస్సాద్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేసింది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!