Israel-Lebanon Tension: ‘‘తగ్గేదే లేదు, పూర్తిశక్తితో హిజ్బుల్లాపై దాడి చేయండి’’.. ఆర్మీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆదేశాలు..
- కాల్పుల విరమణ పిలుపుని పట్టించుకోని ఇజ్రాయిల్..
- హిజ్బుల్లాపై మరింత శక్తితో విరుచుకుపడాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశం..
- పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Lebanon Tension:ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇరు దేశాలు 21 రోజులు పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. అయితే, ఈ పిలుపుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించలేదు. మిత్ర దేశాల ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఇయన చెప్పారు.
Read Also: India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
‘‘ఇది అమెరికా-ఫ్రాన్స్ ప్రతిపాదన, దీనికి ప్రధాని నెతన్యాహూ స్పందించలేదు’’ అని నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉంటే, హిజ్బుల్లాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సైన్యానికి నెతన్యాహూ పిలిపునిచ్చాడు. పూర్తి శకత్తితో దాడి చేయాలని సైన్యాన్ని గురువారం ఆదేశించాడు. లెబనాన్ పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తి చేశారు. దౌత్యపరంగా సమస్యని పరిష్కరించుకోవడానికి లెబనాన్-ఇజ్రాయిల్ సరిహద్దుల్లో తక్షణమే 21 రోజులు కాల్పుల విరమణ పాటించాలని మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జపాన్, గల్ఫ్ దేశాలు, అమెరికా కాల్పుల ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేశాయి.
ఇదిలా ఉంటే, లెబనాన్పై భూతల దాడులతో పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం సైనికులకు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సాధ్యమైన భూదాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీని తర్వాతే కాల్పుల విమరణ పాటించాలని పలు దేశాలు కోరాయి. ఇదిలా ఉంటే హిజ్బుల్లా బుధవారం టెల్ అవీల్లోని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మెస్సాద్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేసింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!