Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..
- ఏడాదైనా ఇజ్రాయిలీ బందీల జాడ లేదు..
- 64 మంది ఇంకా హమాస్ చెరలోనే..
- 251 మందిని బందీలుగా పట్టుకున్న హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
Also Read
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
ఇజ్రాయిల్పై దాడి సమయంలో 251 మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే చనిపోయారు. అయితే, గతేడాది ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయిల్ మధ్య బందీల మార్పిడి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా 117 మంది విడుదలయ్యారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 70 మంది బందీలు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 64 మంది జాడ ఇప్పటికీ తెలియరావడం లేదు. వీరంతా ఎక్కడో చోట సజీవంగా ఉన్నారని ఇజ్రాయిల్ భావిస్తోంది. 64 మందిలో 52 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో 11 మంది ఇజ్రాయిలీ మిలిటరీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. బందీల మార్పిలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. మరణించిన 70 మందిలో 33 మంది మృతదేహాలు ఇప్పటికీ గాజాలో ఉన్నాయని సైన్యం ధృవీకరించింది.
అక్టోబర్ 07 నాటి దాడులు ఇజ్రాయిల్ పై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించవచ్చు. గాజాలోని హమాస్ మిలిటెంట్లు వందలాది రాకెట్లను పేల్చడంతో పాటు ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని కిబ్బట్జ్పై దాడులు చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా 1200 మందిని హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!