Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..
- ఏడాదైనా ఇజ్రాయిలీ బందీల జాడ లేదు..
- 64 మంది ఇంకా హమాస్ చెరలోనే..
- 251 మందిని బందీలుగా పట్టుకున్న హమాస్..
Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఇజ్రాయిల్పై దాడి సమయంలో 251 మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే చనిపోయారు. అయితే, గతేడాది ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయిల్ మధ్య బందీల మార్పిడి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా 117 మంది విడుదలయ్యారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 70 మంది బందీలు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 64 మంది జాడ ఇప్పటికీ తెలియరావడం లేదు. వీరంతా ఎక్కడో చోట సజీవంగా ఉన్నారని ఇజ్రాయిల్ భావిస్తోంది. 64 మందిలో 52 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో 11 మంది ఇజ్రాయిలీ మిలిటరీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. బందీల మార్పిలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. మరణించిన 70 మందిలో 33 మంది మృతదేహాలు ఇప్పటికీ గాజాలో ఉన్నాయని సైన్యం ధృవీకరించింది.
అక్టోబర్ 07 నాటి దాడులు ఇజ్రాయిల్ పై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించవచ్చు. గాజాలోని హమాస్ మిలిటెంట్లు వందలాది రాకెట్లను పేల్చడంతో పాటు ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని కిబ్బట్జ్పై దాడులు చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా 1200 మందిని హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!