Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..
- ఏడాదైనా ఇజ్రాయిలీ బందీల జాడ లేదు..
- 64 మంది ఇంకా హమాస్ చెరలోనే..
- 251 మందిని బందీలుగా పట్టుకున్న హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ఇజ్రాయిల్పై దాడి సమయంలో 251 మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే చనిపోయారు. అయితే, గతేడాది ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయిల్ మధ్య బందీల మార్పిడి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా 117 మంది విడుదలయ్యారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 70 మంది బందీలు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 64 మంది జాడ ఇప్పటికీ తెలియరావడం లేదు. వీరంతా ఎక్కడో చోట సజీవంగా ఉన్నారని ఇజ్రాయిల్ భావిస్తోంది. 64 మందిలో 52 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో 11 మంది ఇజ్రాయిలీ మిలిటరీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. బందీల మార్పిలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. మరణించిన 70 మందిలో 33 మంది మృతదేహాలు ఇప్పటికీ గాజాలో ఉన్నాయని సైన్యం ధృవీకరించింది.
అక్టోబర్ 07 నాటి దాడులు ఇజ్రాయిల్ పై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించవచ్చు. గాజాలోని హమాస్ మిలిటెంట్లు వందలాది రాకెట్లను పేల్చడంతో పాటు ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని కిబ్బట్జ్పై దాడులు చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా 1200 మందిని హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!