ఇరాన్ జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్కు ఇరాన్ కమాండర్ హసన్ సలామీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న హసన్ సలామీ ఈ సందర్భంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ చేశారు.
Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
Israel PM Netanyahu: లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందే టార్గెట్గా ఇజ్రయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుందని వస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు.
Hassan Nasrallah: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య లెబనాన్కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ హసన్ నస్రల్లా యొక్క ఆడియో రికార్డింగ్ను విడుదల చేసింది. ఆ ఆడియోలో, మాజీ హిజ్బుల్లా చీఫ్ తన అనుచరులను "దేశాన్ని రక్షించండి" అని కోరడం వినవచ్చు.
US- Israel: ఇటీవలే ఇజ్రాయెల్పై ఇరాన్ వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా బరిలోకి దిగింది. ఇజ్రాయెల్కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ను అందిస్తామని ఆదివారం నాడు వెల్లడించింది.
Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40…
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.
మనిషి ఏ నొప్పినైనా భరించగలడు గానీ ఆకలి బాధను భరించలేడు. ఉదయం కొంచెం లేటుగా టిఫిన్ చేస్తేనే నీరస పడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు. అలాంటిది కొద్ది నెలలుగా గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తిండి లేక నీరసించిపోతున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కూడా వదలుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
Cyber Attack In Iran: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
America vs Iran: ఇరాన్- ఇజ్రాయెల్ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై తన ఆంక్షలను విస్తరించింది అమెరికా.