Israel: 2023 అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడి దారుణమై దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. పడుకొని ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అత్యంత కిరాతకంగా ఇజ్రాయిలీలను హతమార్చారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా, 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం హమాస్ లక్ష్యంగా గాజాతో పాటు ఇతర…
Hamas Attack On Israel: అక్టోబర్ 07, 2023న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై భీకర దాడి చేశారు. ఒకేసారి వందలాది రాకెట్లను ప్రయోగించడంతో పాటు హమాస్ మిలిటెంట్ ఇజ్రాయిల్ కంచెను దాటి సరిహద్దు గ్రామాల్లో మారణహోమం సృష్టించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందర్ని దారుణంగా చంపేశారు.
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఆదివారం ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’ జరగనుంది. యూనినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనన్తో నెతన్యాహూ బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. బుధవారం హడస్సా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత, ఆయన ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ కారణంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యెమెన్లో గల సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.
సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది.
UN peacekeeping force: ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యుఎన్డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్సి)గా పనిచేస్తున్న బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆయన మరణించే సమయంలో మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్గా కూడా ఉన్నారు.
Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు.
పశ్చిమాసియాలో సెప్టెంబర్ 17న ఊహించని విపత్తు తీవ్ర కలకలం రేపింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో హఠాత్తుగా హిజ్బుల్లా చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయి.
హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.
నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.