Elon Musk: ఎలాన్ మస్క్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?
- మస్క్తో చర్చలు జరిపిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు
- బందీలను విడిపించే అంశంపై చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ పోరు నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో మిలిటెంట్ చెరలోని తమ బందీలను విడిపించేందుకు టెల్అవీవ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)ని పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్ని నియమించారు. ఈ నేపథ్యంలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మస్క్ ఫోన్లో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
READ MORE; Sai Kiran : ‘నువ్వే కావాలి’ అంటూ నటిని పెళ్లాడనున్న సీరియల్ నటుడు
Also Read
ఈ వారం ప్రారంభంలో మస్క్కు ఐజాక్ ఫోన్ చేసినట్లు సమాచారం. గాజాలో హమాస్ మిలిటెంట్ల చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలను తిరిగి ప్రారంభించడం గురించి చర్చించారు. బందీలుగా ఉన్న కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకే ఐజాక్ మస్క్తో ముచ్చటించినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారిని ఎలాన్ మస్క్ కలిశారని వార్తలు వెలువడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్లోని రాయబారి అమీర్ సయీద్ ఇరవాణి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతను తగ్గించే మార్గాలపై చర్చించారు. అయితే, ఇరాన్కు బద్ధ వ్యతిరేకులైన విదేశాంగ కార్యదర్శి నామినీ మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్లకు ఈ సమావేశం గురించి తెలుసా లేదా అనేది నివేదికలో స్పష్టంగా లేదు. మరోవైపు, ఇరాన్ రాయబారితో మస్క్ భేటీ ‘పాజిటివ్’ అని ఇద్దరు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!