ఇరాన్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 22,000 మందికి ఇరాన్ న్యాయ అధికారులు క్షమాభిక్ష ప్రకటించారని ఇరాన్ న్యాయశాఖ అధిపతి ఘోలామ్హోస్సేన్ మొహసేని ఎజీ సోమవారం తెలిపారు.
Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు…
ఇరాన్, సౌదీ అరేబియా రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతల తర్వాత దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి అంగీకరించాయి.
ఇరాన్లో బుధవారం బాలికల పాఠశాలలపై అనుమానాస్పద గ్యాస్ దాడుల కారణంగా 100 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇరాన్ అంతటా పాఠశాల విద్యార్థినులలో గత మూడు నెలల్లో వందలాది శ్వాసకోశ బాధల కేసులు నమోదయ్యాయి.
కొన్ని నెలల క్రితం ఇరాన్ జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఇరాన్ మంత్రి ఒకరు వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను మరువకముందే ఇరాన్ను మరో విషయం కుదిపేస్తోంది.
Iran Cruise Missile: ఇరాన్ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ చేతికి.. మరో కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్ను అందించింది. ఇది సుమారు 1,650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను మిస్సైల్ చేధించగలదని టాప్ కమాండర్ శుక్రవారం వెల్లడించారు.
ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె న్యాయవాది మంగళవారం తెలిపారు. మాజీ అధ్యక్షుడి కుమార్తె ఫేజ్ హషేమీపై వచ్చిన ఆరోపణల వివరాలను న్యాయవాది వెల్లడించలేదు.
Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు…