Russia-Ukraine War: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదలిపెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. వరసగా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి తీసుకున్న ‘‘ కామికేజ్’’ డ్రోన్లతో విద్యుత్ గ్రిడ్స్, మౌళిక సదుపాయాలపై దాడులు చేస్తోంది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ ను కూల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది రష్యా. రానున్న శీతాకాలం దృష్ట్యా రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.
ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలు తారాస్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు ఎవ్వరూ కూడా ఉక్రెయిన్ వెళ్లవద్దని కోరింది. విద్య, ఇతర కారణాలతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే దేశాన్ని వీడాలని సూచించింది. కీవ్ లోని భారతీయ రాయబార కార్యాలయం ఈ సూచనలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వెంటనే దేశాన్ని వదిలిపెట్టాలని సూచించింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు భారతదేశం ‘‘ఆపరేషన్ గంగా’’ చేపట్టి ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థులను ఎయిర్ లిఫ్ట్ చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రొమేనియా, పోలాండ్, స్లొవేకియా, హంగేరీ, మాల్టోవా దేశాల మీదుగా ఇండియాకు తీసుకువచ్చారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Anasuya sister: యాంకర్ గా అనసూయ చెల్లి.. మరి అక్క పరిస్థితి!
ప్రస్తుతం ఉక్రెయిన్ పై దాడుల తీవ్రతను పెంచింది రష్యా. డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలన్ స్కీ తెలిపారు. రానున్న రోజుల్ దేశంలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని ప్రజలు సిద్ధంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఇరాన్, రష్యాకు కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహంగా ఉంది ఉక్రెయిన్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కుబేలా, ఇరాన్ తో దౌత్యబంధాలను తెంచుకోవాలని మంగళవారం ప్రతిపాదించారు. ఉక్రెయిన్లను చంపేందుకు రష్యాకు ఇరాన్ సహకరిస్తుందని… ఆ దేశంపై అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ కోరుతోంది.
Advisory for Indian nationals from Indian Embassy in Kyiv: pic.twitter.com/lltvbL9caH
— Shiv Aroor (@ShivAroor) October 19, 2022
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!