Iran Nuclear Program: ట్రంప్కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Nuclear Program: టెహ్రాన్లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు, శక్తి, వైద్యం, మానవ అవసరాల కోసమేనని పెజెష్కియన్ పునరుద్ఘాటించారు.
READ ALSO: KTR : హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
దాడితో ఇరాన్కు నష్టం ఎంత?
జూన్లో అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ అణు కేంద్రాలపై దాడి చేశాయి. దాడి అనంతరం అమెరికా మాట్లాడుతూ.. ఈ కేంద్రాలను అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అయితే ఇరాన్ తన కార్యక్రమం పూర్తిగా శాంతియుతమని కొనసాగిస్తోందని చెప్పింది. అమెరికా – ఇజ్రాయెల్ దాడుల్లో అనేక మంది ఇరానియన్ శాస్త్రవేత్తలు, అధికారులు మరణించారు. ఈ దాడిలో యురేనియం సుసంపన్న కర్మాగారాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై 500 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు, 1,100 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 32 మంది మరణించారు, 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ ధ్వంసమైన తన అణు కేంద్రాలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తే అమెరికా కొత్త దాడులను ప్రారంభిస్తుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
యురేనియం శుద్ధిని ఆపబోం: ఇరాన్
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి శనివారం మాట్లాడుతూ.. తమ దేశం అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరపదని, కానీ పరోక్ష చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. “మా క్షిపణి కార్యక్రమంపై మేము ఎప్పటికీ చర్చలు జరపము” అని ఆయన అన్నారు. “ఏ వివేకవంతమైన దేశమూ తన రక్షణను వదులుకోదు. మేము యురేనియం సుసంపన్నతను ఆపము” అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ న్యాయమైన పరిష్కారానికి సిద్ధంగా ఉందని, కానీ అమెరికా షరతులను అంగీకరించదని అరాఘ్చి అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పెజెష్కియన్ మాట్లాడుతూ.. ఇరాన్ దురాక్రమణదారులకు ఎప్పటికీ లొంగదని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఖండించారు. ఇరాన్ దౌత్య చర్చల మార్గంలో ఉన్నప్పుడు అవి జరిగాయని ఆయన వెల్లడించారు.
READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీలో మాస్ యాంగిల్.. చేపలు పట్టిన కాంగ్రెస్ అగ్రనేత !
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?