అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను…
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు. చనిపోయిన యువతి ఎవరో తేల్చే లేకపోతున్నారు పోలీసులు. కాగా.. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తేనే హంతకుల్ని పట్టుకునే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. యువతి వయసు 20 సంవత్సరాల లోపు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది. కాగా.. మొబైల్ ఫోను పూర్తిగా…
నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే, నేడు మీడియా ఎదుట నిందితులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకి తీసుకెళ్ళి నర హంతకుడు హత్య చేశాడు.
బంగ్లాదేశ్ కు తరచూ వెళ్లి వచ్చే ఇలియాస్ అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో పాటు పలువురు పాకిస్తానీయులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడింది. ఎలాగైనా ఇలియాస్ ను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడ్ని చేర్చారు.
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్లోని దుత్తాపుకూర్లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.