Vasupalli Ganesh: స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. కాగా.. ఈ విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. అయితే.. వాసుపల్లి గణేష్ స్పీకర్ సీతారాంను ఒక్క నిమిషం మాత్రమే కలిసి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై పోటీ చేసి గెలిచాను.. తర్వాత టీడీపీ పేద వాళ్ళకు అన్యాయం చేస్తోందని గమనించి పార్టీకి దూరం జరిగానని తెలిపారు. తాను ఆ పార్టీని మోసం చేశానని టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా.. స్పీకర్ తీసుకునే ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. స్పీకర్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఈ అంశంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Read Also: AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Also Read
కాగా.. ఈరోజు వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు. ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ తమ్మినేని.. మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేను విచారించారు. అయితే.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు విచారణకు రావాల్సి ఉండగా.. కేవలం వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.. తీర్పు రిజర్వ్ చేసింది.
Read Also: Chandrababu: ‘రా కదలిరా’ సభలో గందరగోళం.. కిందపడబోయిన చంద్రబాబు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..