Home
International News
International News News
-
మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి
పాకిస్థాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు. Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్..… -
మహిళలను హింసించడం దేవుడ్ని అవమానించినట్టే: పోప్ ఫ్రాన్సిస్
మహిళలను హింసించడం.. దేవుడ్ని అవమానించినట్లేనని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సందేశమిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ బసలీకా రోమన్ కాథలిక్లో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరాధన నిర్వహించారు. Read Also క్రిస్ గేల్కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు అలాగే నూతన వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో మాతృత్వం, స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించారు. జీవితాలు వీరితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. వారిపై హింసను ముగింపు పలకాలని… -
సూడాన్లో కూలిన బంగారు గని.. 38 మంది మృతి..
సూడాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్లో… -
నాసా ప్రయోగం సక్సెస్… అంతరిక్షంలోకి అతిపెద్ద టెలీస్కోప్
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్… -
బంపర్ ఆఫర్… పిల్లల్ని కంటే రూ.25 లక్షలు రుణం
తమ దేశంలో జనాభా పెరుగుదలకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివాహం చేసుకున్న దంపతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దంపతులు పిల్లల్ని కంటే ‘బేబీ లోన్’ పేరుతో రూ.25 లక్షలు వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తామని చైనాలోని జిలిన్ ప్రావిన్స్ వెల్లడించింది. పిల్లల సంఖ్యను బట్టి వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఒకవేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పన్నులో మినహాయింపు… -
అమెరికా వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా రద్దు
ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు వీసాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా హెచ్1బీతో పాటు హెచ్3, హెచ్4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ రద్దు వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది 2022 వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతీయ కాన్సులేట్/ఎంబసీ అధికారులు తుది… -
తుఫాన్ బీభత్సానికి 375 మంది బలి
ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం… -
నిమిషంలోనే చావు… సూసైడ్ మిషన్కు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
స్విటర్లాండ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం అక్కడి సైంటిస్టులు ఓ మిషన్ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని… -
విదేశీ సాయం లేకుండానే..తాలిబన్ బడ్జెట్
తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.… -
చుక్కల్లో నిత్యావసర ధరలు.. అక్కడ కిలో పిండి 2,400.. 25 కిలోల బియ్యం 2,700
ఆప్ఘనిస్తాన్లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో…
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!