Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి మహిళ గొంతు కోసం గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్…
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్ (24), దీక్ష జాదన్ (25)లు ఇండోర్లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి…
ఇండోర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేశాడు. నిందితుడు మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్లో గ్లాస్ని చొప్పించాడు. ఆ బాధతో అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేశారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ సమీపంలోని మోవ్ తహసీల్ సమీపంలోని కోరల్ గ్రామంలో శుక్రవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఫామ్ హౌస్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు చనిపోయారు.
Heart Attack Video: ఇండోర్లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మృతికి సంబంధించిన వీడియో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గ్రహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని., పరదేశిపుర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ ద్వివేది తెలిపారు. ఓ యువకుడు ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.…
English Teacher: మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు.