Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bandi Sanjay Said That The Formation Of The National Turmeric Board Will Benefit The Farmers A Lot

Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..

Published Date :January 14, 2025 , 12:48 pm
By RAMAKRISHNA KENCHE
  • ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే
  • బోర్డును సాధించిన అరవింద్‌కు అభినందనలు
  • సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు
  • పసుపు బోర్డు వల్ల ఈ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు
  • పసుపు రైతులకు గిట్టుబాటు సమస్యే ఉండదు
  • పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం
  • బోర్డు సాధనకు పోరాడిన పసుపు రైతులందరికీ హ్యాట్సాఫ్
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

READ MORE: Pani Puri: పానీపూరి తింటే అనారోగ్య సమస్యలే కాకుండా లాభాలున్నాయని తెలుసా?

“అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు శుభవార్త అందించిన మహనీయుడు ప్రధాని నరేంద్ర మోడీ, సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, ఈ బోర్డు ఏర్పాటులో కర్త, కర్మ, క్రియగా ఉంటూ మొండిపట్టుతో విజయం సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్, బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు. ఈ శుభ ఘడియల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పసుపు బోర్డు కోసం 178మంది పసుపు రైతులు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పసుపు బోర్డు అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ‘‘బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ నని ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. చివరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు.” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

READ MORE: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..

పసుపు బోర్డు ఏర్పాటువల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నయని బండి సంజయ్ తెలిపారు. “తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలగబోతున్నయ్. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుంది. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుంది. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాక్కింగ్ తోపాటు జాతీయంగా, అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశముంది. ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రకృతివైపరీత్యాలవల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమా ఉంటుంది. క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ద్వారా నిరంతరం క్వాలిటీ చెక్, క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు.” అని ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandi Sanjay Kumar
  • Center
  • good news
  • Indore
  • Kishan Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..

  • Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం

  • Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

  • Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions