హమ్మయ్య.. 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఇరాన్తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి.
ట్రంప్ బెదిరింపులు కారణంగా గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. అయితే ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్కు 48 గంటల గడువు ఇచ్చారు. ఆలోపు ఒప్పందం చేసుకోకపోతే నరకం చూస్తారని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తాయనుకుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం నేడు ‘బ్లడ్ బాత్’ (భారీ పతనం)తో షాక్ ఇచ్చింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి, సెన్సెక్స్ లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ భారీ పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్, ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడులు చేయడం…
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)…
దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒక్కరోజు లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. త్వరలోనే పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన మంగళవారం మార్కెట్కు బాగా కలిసొచ్చింది. దీంతో భారీ లాభాలు అర్జించింది.
IDFC First Bank scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో రూ. 590 కోట్ల మేర ఫ్రాడ్ బయటపడింది.
Indian Stock Market: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, అగ్రశ్రేణి కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఓ దశలో కుప్పకూలి, మరుసటి రోజే అనూహ్యంగా పుంజుకోవడంతో మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) 0.22 శాతం లాభాన్ని నమోదు చేయగా.. టాప్-10 కంపెనీల్లో ఆరు సంస్థలు ఏకంగా రూ.63,478 కోట్ల సంపదను ఆర్జించాయి. READ ALSO:…