Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
- గోదావరి ఘాట్లలో అధ్వాన పరిస్థితి
- భక్తులకు ఇబ్బందులు.. దుర్వాసనతో ఇబ్బంది
- అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
- పుష్కరాల ముందు చర్యలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల కోసం భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఘాట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది.
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
భక్తులు కనీసం అక్కడ నిలబడలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం , సాయంత్రం వేళల్లో ఈ దుర్వాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. వేసవి కాలం కావడంతో సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరానికి వచ్చే ప్రజలు అక్కడి అపరిశుభ్రతను చూసి విస్తుపోతున్నారు. శుభ్రత పనుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై చివరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి ముందే ఘాట్లను సిద్ధం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత , సౌకర్యాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని, మురుగునీటి సమస్యను పరిష్కరించి భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధికి, పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!