Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
- గోదావరి ఘాట్లలో అధ్వాన పరిస్థితి
- భక్తులకు ఇబ్బందులు.. దుర్వాసనతో ఇబ్బంది
- అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
- పుష్కరాల ముందు చర్యలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల కోసం భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఘాట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది.
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
భక్తులు కనీసం అక్కడ నిలబడలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం , సాయంత్రం వేళల్లో ఈ దుర్వాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. వేసవి కాలం కావడంతో సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరానికి వచ్చే ప్రజలు అక్కడి అపరిశుభ్రతను చూసి విస్తుపోతున్నారు. శుభ్రత పనుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై చివరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి ముందే ఘాట్లను సిద్ధం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత , సౌకర్యాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని, మురుగునీటి సమస్యను పరిష్కరించి భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధికి, పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?