Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
- గోదావరి ఘాట్లలో అధ్వాన పరిస్థితి
- భక్తులకు ఇబ్బందులు.. దుర్వాసనతో ఇబ్బంది
- అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
- పుష్కరాల ముందు చర్యలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల కోసం భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఘాట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది.
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
భక్తులు కనీసం అక్కడ నిలబడలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం , సాయంత్రం వేళల్లో ఈ దుర్వాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. వేసవి కాలం కావడంతో సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరానికి వచ్చే ప్రజలు అక్కడి అపరిశుభ్రతను చూసి విస్తుపోతున్నారు. శుభ్రత పనుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై చివరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి ముందే ఘాట్లను సిద్ధం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత , సౌకర్యాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని, మురుగునీటి సమస్యను పరిష్కరించి భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధికి, పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!