Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!
- గోదావరి ఘాట్లలో అధ్వాన పరిస్థితి
- భక్తులకు ఇబ్బందులు.. దుర్వాసనతో ఇబ్బంది
- అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
- పుష్కరాల ముందు చర్యలు అవసరం
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల కోసం భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఘాట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది.
IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
Also Read
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
భక్తులు కనీసం అక్కడ నిలబడలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం , సాయంత్రం వేళల్లో ఈ దుర్వాసన మరింత ఎక్కువగా వ్యాపిస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. వేసవి కాలం కావడంతో సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరానికి వచ్చే ప్రజలు అక్కడి అపరిశుభ్రతను చూసి విస్తుపోతున్నారు. శుభ్రత పనుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యపై చివరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవానికి ముందే ఘాట్లను సిద్ధం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత , సౌకర్యాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని, మురుగునీటి సమస్యను పరిష్కరించి భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధికి, పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో