Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. కారణాలు ఇవే..
- మూడు రోజుల లాభాలకు బ్రేక్..
- ఒక్కసారిగా కుప్పకూలిన ఇండియన్ స్టాక్ మార్కెట్..
- రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇస్తాయనుకుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం నేడు ‘బ్లడ్ బాత్’ (భారీ పతనం)తో షాక్ ఇచ్చింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి, సెన్సెక్స్ లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ భారీ పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్, ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణి దాడులు చేయడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. దీనివల్ల భారత్ లాంటి దేశాల ఇంధన భద్రతపై ఎఫెక్ట్ పడుతోంది. భారత్ తన ఎల్ఎన్జీ (LNG) అవసరాల్లో దాదాపు 47 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
ముడిచమురు ధరల మంట
చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరగడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 3 శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 92.89 వద్ద కనిష్ఠానికి పడిపోవడం మరో ప్రధాన కారణం. కరెన్సీ బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటారు.
Also Read
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
Also Read:Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్మీ 5G ఫోన్ విడుదల..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం.. యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే హెచ్చరికలు అమెరికా మార్కెట్లను దెబ్బతీశాయి. దాని ప్రభావంతో జపాన్ (Nikkei), దక్షిణ కొరియా (Kospi) మార్కెట్లు కూడా 2 శాతం పైగా నష్టపోవడం భారత మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
గత మూడు రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో.. ప్రస్తుత అనిశ్చితిని చూసి ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారు. దీనివల్ల అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు మరింతగా పతనమయ్యాయి. భారతదేశ ఇంధన అవసరాలకు కీలకమైన ఖతార్పై దాడి జరగడం, దానివల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటమే నేటి ‘బ్లడ్ బాత్’కు అసలు సిసలు కారణం. కేవలం ఒక్క రోజులోనే రూ. 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!