Indian Stock Market: 5 రోజుల్లో రూ.63 వేల కోట్లు సంపాదించారు.. ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Stock Market: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, అగ్రశ్రేణి కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఓ దశలో కుప్పకూలి, మరుసటి రోజే అనూహ్యంగా పుంజుకోవడంతో మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) 0.22 శాతం లాభాన్ని నమోదు చేయగా.. టాప్-10 కంపెనీల్లో ఆరు సంస్థలు ఏకంగా రూ.63,478 కోట్ల సంపదను ఆర్జించాయి.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
గత వారం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన సంస్థల్లో లార్సెన్ & టూబ్రో (L&T) అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.28,523 కోట్లు పెరిగి, మొత్తం రూ.6.02 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) సైతం దూసుకుపోయింది. ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లు సుమారు రూ.16,015 కోట్లు ఆర్జించగా, దీని మార్కెట్ క్యాప్ రూ.11.22 లక్షల కోట్లకు చేరింది. అలాగే హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ విలువ రూ.9,617 కోట్లు వృద్ధి చెంది రూ.14.03 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.
లాభాల్లో రిలయన్స్, ఎల్ఐసీ
దేశీయ దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీలు కూడా లాభాల బాటలోనే పయనించాయి. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.5,977 కోట్లు పెరిగి, రూ.5.52 లక్షల కోట్లకు చేరింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ రూ.3,142 కోట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ స్వల్పంగా రూ.202 కోట్లు పెరిగినప్పటికీ, రూ.19.21 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
నష్టపోయిన ఐటీ, టెలికాం దిగ్గజ సంస్థ ఇవే..
ఈ 5 రోజుల్లో ఆరు కంపెనీలు లాభాల్లో దూసుకుపోగా, మరో నాలుగు దిగ్గజ సంస్థలు మాత్రం నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మార్కెట్ విలువ రూ.15,338 కోట్లు ఆవిరైపోయింది. ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ రూ.14,632 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్ రూ.6,791 కోట్లు, టీసీఎస్ రూ.1,989 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి.
టాప్-10 దిగ్గజ సంస్థలు ఇవే..
ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా దేశంలో టాప్-10 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఇవే.. 1.రిలయన్స్ ఇండస్ట్రీస్, 2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, 3. భారతీ ఎయిర్టెల్, 4. ఎస్బీఐ, 5. ఐసీఐసీఐ బ్యాంక్, 6. టీసీఎస్, 7. బజాజ్ ఫైనాన్స్, 8. ఎల్అండ్టీ, 9. ఎల్ఐసీ, 10. ఇన్ఫోసిస్.
READ ALSO: T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!