గత ఏడాది కాలంగా తూర్పు లద్ధాఖ్ ప్రాంతంపై చైనా కన్నేసింది. చైనా బోర్డర్లో భారీగా సైనికులను మోహరిస్తూ రావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇరు దేశాలకు చెందిన సైనికుల మద్య బాహాబాహీలు జరిగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కి తీసుకుంటూనే చైనా తన బోర్డర్ను ఆధునీకరిస్తు వచ్చింది. యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భద్రపరిచేందుకు కాంక్రట్ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా…