Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నిండేలా చేస్తుంది. అయితే ఈ ఇడ్లీని ఇంకా ఆరోగ్యకరంగా మార్చాలంటే బియ్యం బదులుగా మిల్లెట్స్ వాడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీకూ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కోడో మిల్లెట్ (ఆరికలు) ఇడ్లీ గురించి తెలుసుకుందాం.. కోడో మిల్లెట్ను తమిళంలో వరగు, తెలుగులో అరికెలు అంటారు. ఇది పోషకాలు ఎక్కువగా ఉన్న ఒక మంచి ధాన్యం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పోలిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. తరచుగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి సైతం ఇది ఉపయోగకరం. ఇప్పుడు ఇంట్లోనే కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం.
READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ముందుగా ఆరికెలతో ఇడ్లీ పిండిని సిద్ధం చేసుకోవాలి.పొటాటో మసాలా కోసం మూడు పెద్ద బంగాళాదుంపలను మరిగించి తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. పసుపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా మెత్తగా చేసిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే, పొటాటో మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్స్కి కొద్దిగా నూనె రాసి, ముందుగా కొంచెం పిండిని పోయాలి. దాని మీద ఒక స్పూన్ పొటాటో మసాలా వేయాలి. పైగా మళ్లీ కొంచెం పిండిని పోసి మూసివేయాలి. తరువాత 12 నుంచి 15 నిమిషాలు ఆవిరితో ఉడికించాలి. వేడి వేడి కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండి పులియడం చాలా ముఖ్యం. కనీసం 8 నుంచి 10 గంటలు, రాత్రంతా వేడి ప్రదేశంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా పులిస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. అలాగే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!